Adipurush Movie Business | ఫలితం ఎలా ఉన్నా ప్రభాస్ మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘సాహో’, ‘రాధేశ్యామ్’ వంటి రెండు వరుస ఫ్లాప్లు వచ్చిన ప్రభాస్ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ప్రభాస్ సినిమా నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చిన అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో ‘ఆదిపురుష్’ ఒకటి. ‘తన్హాజీ’ ఫేం ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ మూవీ షూటింగ్ పూర్తయి నెలలు గడుస్తున్న సినిమాకు సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా ఇప్పటివరకు రాలేదు. దాంతో మేకర్స్పై అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్గా మారింది.
ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులు రూ.100 కోట్లు పలికాయట. ప్రముఖ దిగ్గజ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ థియేట్రికల్ హక్కులను దక్కించుకుందట. ఇప్పటివరకు టాలీవుడ్ సినీ చరిత్రలోనే కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో 100కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిన ఏకైక సినిమాగా ‘ఆదిపురుష్’ నిలిచింది. దీన్ని బట్టి చూస్తే ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. ఈ చిత్రాన్ని దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్తో భూషణ్ కుమార్ నిర్మిస్తున్నాడు. చిత్ర బృందం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది.
మైథలాజికల్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఓంరౌత్ రామాయణం నేపథ్యంలో రూపొందించాడు. ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా, కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. అంతేకాకుండా ఈ చిత్రాన్ని అత్యంత భారీగా దాదాపు 20 భాషల్లో పాన్ వరల్డ్ సినిమాగా మేకర్స్ రూపొందిస్తున్నారట. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ రానున్నట్లు తెలుస్తుంది. ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’తో పాటు నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్-K’ చిత్రాల షూటింగ్లలో బిజీగా ఉన్నాడు.