బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ ప్రస్తుతం బడా ప్రాజెక్టులు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పుడు ఆయన చేతిలో నాలుగుకి పైగా ప్రాజెక్టులు ఉండగా, ఇవన్ని కూడా భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నవే. ఈ సినిమాల కోసం ప్రభాస్ పెద్ద ఎత్తునే రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నాడనే టాక్ వినిపిస్తుంది. అయితే ఎప్పుడు ఏ ఆపద వచ్చినా తానున్నాననే భరోసా కల్పిస్తుంటాడు ప్రభాస్.
కరోనా సమయంలో 50లక్షల రూపాయల చొప్పున రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళాలు అందించారు. పీఎం రిలీఫ్ ఫండ్కి మూడు కోట్లు అందించారు. ఇక తాజాగా ఏపీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రభాస్ కోటి రూపాయల విరాళం అందించబోతున్నాడు. త్వరలోనే కోటి రూపాయల చెక్ని సీఎం ఆఫీసుకి పంపనున్నాడు. ప్రభాస్ మంచితనంపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో కురిసిన అసాధారణ వర్షాల కారణంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ప్రజలు చాలా మంది నిరాశ్రయులయ్యారు. జన జీవనం అస్థవ్యస్తంగా మారింది. వరద బాధితులను రక్షించేందుకు, వారిని ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఈ నేపథ్యంలో ఏపీ వరద బాధిత జనం కోసం తెలుగు చిత్ర పరిశ్రమ కదులుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ రూ. 25లక్షలు ప్రకటించారు. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ పది లక్షలు విరాళంగా సీఎం రిలీఫ్ ఫండ్కి అందజేశారు. చిరంజీవి రూ.25లక్షలు, మహేష్ రూ. 25లక్షలు, రామ్చరణ్ రూ.25 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే.