బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ ప్రస్తుతం నాలుగు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాధే శ్యామ్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా, సలార్, ఆదిపురుష్ షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. ఇక నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న సైన్స్ ఫిక్షన్ మరి కొద్ది రోజులలో మొదలు కానుంది.
పాన్ ఇండియా స్టార్గా మారినా కూడా ప్రభాస్ పెద్దగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడు. అందరి హీరోల మాదిరిగా కాకుండా చాలా ప్రైవసీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆయనకు సంబంధించిన విషయాలు పెద్దగా బయటకు రావు. అయితే తాజాగా ప్రభాస్ ఓ వ్యక్తితో చాలా జాలీగా కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు.. ఆయనకు నటనలో ఓనమాలు దిద్దిన గురువు సత్యానంద్.
సత్యానంద్ బర్త్ డే సందర్భంగా ప్రభాస్.. గురువుతో కేక్ కట్ చేయించి ఆయనతో ఆనందక్షణాలు గడిపారు. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రభాస్తో పాటు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి ఎంతో మంది స్టార్స్కు నటనలో శిక్షణ ఇచ్చారు సత్యానంద్.