యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్లో ఆదిపురుష్ ఒకటి. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.మైథలాజికల్ సినిమా కావడంతో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో 3డీ లో ఈ మూవీని రూపొందిస్తున్నారు
ఈ చిత్రానికి సంబంధించి 65 రోజుల మేర టాకీ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ముంబైలో జరుగుతుండగా, ప్రభాస్ కూడా అక్కడే మకాం వేశాడు. అతను షూటింగ్లో పాల్గొనకుండా సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ కోసం నాలుగు రోజులుగా ఓ స్టూడియోలో రిహార్సల్స్ చేస్తున్నారట. హీరోహీరోయిన్లు పాల్గొనే ఈ పాట చిత్రీకరణ వచ్చే వారం నుంచి ఉంటుందని టాక్.
సుమారు 450 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుండగా, ఈ చిత్రాన్ని 2022 ఆగస్టు 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. డిసెంబర్ నాటికి షూటింగ్ కంప్లీట్ చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ నెమ్మదిగా చేసినా ఆగష్టు నాటికి సినిమా రెడీ అవుతుందని భావిస్తున్నారట. చిత్రంలో లక్ష్మణుడిగా బాలీవుడ్ యువ హీరో సన్నీ సింగ్ కనిపించనున్నారు. టీ-సిరీస్ ఫిలిమ్స్ బ్యానర్ పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్ ,రాజేష్ నాయర్ , ఓం రౌత్ లు కలసి ‘ఆదిపురుష్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం సాచెత్ తాండన్ – పరంపరా ఠాకూర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నారు.