యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన నటించిన రాధే శ్యామ్ చిత్రం విడుదలకి సిద్ధం కాగా ప్రస్తుతం సలార్,ఆదిపురుష్ చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. సలార్ చిత్రం పాన్ ఇండియా మూవీగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతుంది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్కు జోడీగా శృతి హాసన్ నటిస్తుంది.
సలార్లో ప్రశాంత్ నీల్ ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేయగా,ఇందుకోసం శ్రీనిధి శెట్టి, శ్రద్ధా కపూర్ల పేర్లు పరిశీలిస్తున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. శ్రద్ధా ఇప్పటికే ప్రభాస్తో కలిసి సాహో అనే చిత్రం చేసింది. ఈ మూవీ తెలుగులో దారుణంగా నిరాశపరచింది. ఇప్పుడు సలార్ చిత్రంతో ఎంటర్టైన్ చేయాలని శ్రద్ధా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక చిత్రంలో మరో పాత్ర కోసం మీనాక్షి చౌదరిని ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలో జరగనున్న కొత్త షెడ్యూల్లో ఆమె చిత్ర బృందంతో కలవనున్నట్లు తెలుస్తోంది.
సలార్ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. యాక్షన్ అడ్వంచరస్ చిత్రంగా ఈ మూవీ రూపొందుతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్లో మూవీని విడుదల చేయాలనే ప్లాన్లో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తుంది.