ఒకప్పుడు హీరోయిన్గా నటించి అలరించిన అందాల ముద్దుగుమ్మ నటి పూర్ణ. అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటించిన సీమ టపాకాయ్ సినిమాతో గుర్తింపు హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ.. ఆ తర్వాత డైరెక్టర్ రవిబాబు తెరకెక్కించిన అవును, లడ్డుబాబు, అవును 2 సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటుంది.
అఖండ చిత్రంలో కీలక పాత్ర పోషించిన పూర్ణ..‘అఖండ’ సినిమా సక్సెస్ మీట్ లో స్టేజ్పై చాలా ఎగ్జైటింగ్గా మాట్లాడింది. తన 16 ఏళ్ల కెరీర్ లో ఇంతటి సక్సెస్ ఫుల్ మూవీ గురించి వేదికపై మాట్లాడడం ఇదే మొదటిసారని, మాట్లాడడానికి మాటలు రావట్లేదని అన్నారు. శ్రీకాంత్ గారు నన్ను భయపెట్టినా కూడా మీ అందం ముందు ఆ భయం తెలియలేదు. బాలయ్య గారి గురించి చెప్పేందుకు మాటలు చాలడం లేదు. సాష్టాంగ నమస్కారం చేస్తాను. ఇంత కంటే ఎక్కువ చెప్పలేను అంటూ సాష్టాంగ నమస్కారం చేసి ఆశ్చర్యపరిచింది.
మీలాంటి వారితో పని చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మీ నుంచి ఎంతో నేర్చుకున్నాను. బాలయ్య బాబుకు ఎవ్వరూ దిష్టి పెట్టకూడదు అని పూర్ణ తెలిపింది. ఇక స్టేజ్ పైనే ఉన్న ఉదయ భాను.. పూర్ణ చెప్పినవన్నీ అక్షర సత్యాలేనని, బాలయ్య బాబు ఒక్కడే.. ఒక్కడే బాలయ్య.. ఆయనకు ఎవ్వరూ సాటి రారు అంటూ ప్రశంసల జల్లు కురిపించింది. ఇదిలా ఉంటే బాలయ్య నటించిన అఖండ చిత్రం వంద కోట్ల వైపు పరుగులు పెడుతుంది.