ఈ మధ్య కాలంలో సినిమా కలెక్షన్లకు ప్రమోషన్లు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. కంటెంట్ వీక్గా ఉన్నా సరే ప్రమోషన్లు పీక్లో చేస్తే ఓపెనింగ్స్ భారీ స్థాయిలో రాబట్టుకోవచ్చు. టాలీవుడ్లో ఎన్నో చిన్న సినిమాలు ప్రమోషన్లతోనే సేఫ్ అయ్యాయి. హ్యపీ బర్త్డే, ఫస్ట్ డే ఫస్ట్ షో వంటి సినిమాలకు మొదటి రోజే ఫ్లాప్ టాక్ వచ్చింది. కానీ రిలీజ్కు ముందు భారీగా ప్రమోషన్లు జరపడంతో ఓపెనింగ్స్తో సగం బడ్జెట్ రికవరీ అయింది. దాంతో నిర్మాతలు ఎంతో కొంత సేఫ్ అయ్యారు. ఇక ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్లుగా మిగిలిన రాధేశ్యామ్, ఆచార్య, లైగర్ సినిమాలు కూడా ఓపెనింగ్స్ భారీ రేంజ్లో రాబట్టాయి. దానికి ముఖ్య కారణం ప్రమోషన్లే.
అయితే పెద్ద సినిమాలు భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపకుంటాయి. దాంతో ఓపెనింగ్స్ ఎంత రేంజ్లో వచ్చినా పావు వంతు బడ్జెట్ కూడా రికవరీ కాదు. కానీ తక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమాలు ప్రమోషన్లు చేస్తే బాక్సాఫీస్ దగ్గర సేఫ్ అయ్యే చాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాగా వచ్చే సంక్రాంతికి పోరు సిద్ధమైంది. నేనంటే.. నేను అంటూ ప్రమోషన్ల నుండే పోటీ పడుతున్నాయి. ఓ వైపు ‘వీరసింహా రెడ్డి’, మరో వైపు ‘వాల్తేరు వీరయ్య’ సమరానికి సై అంటూ వచ్చేస్తున్నారు. కానీ అరవ సినిమాలు ‘వారసుడు’, ‘తునివు’లు మాత్రం ఇంకా ప్రమోషన్లను మొదలు పెట్టలేదు.
దిల్రాజు తమిళంలో ఓ రేంజ్ హడావిడి చేస్తుంటే తెలుగులో మాత్రం ఎలాంటి ప్రమోషన్లు చేయడం లేదు. తమిళంలో ప్రతీ వారం ఏదో ఒక అప్డేట్తో హల్చల్ చేస్తుంటే.. తెలుగులో మాత్రం ఎలాంటి సందడి లేదు. ప్రమోషన్లే సినిమాకు పునాది అనే దిల్రాజు.. వారసుడికి తెలుగులో ప్రమోషన్లు జరపకపోవడంతో అందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఇప్పటివరకు తెలుగులో రెండు పోస్టర్లు, ఒక పాట మాత్రమే రిలీజైయ్యాయి. ఇక వారసుడు పరిస్థితి ఇలా ఉంటే.. అజిత్ ‘తెగింపు’ ప్రమోషన్లలో నత్త నడక సాగిస్తుంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి ఒక్క పోస్టర్ మాత్రమే రిలీజ్ అయింది. నిజానికి అజిత్ టాలీవుడ్ మార్కెట్పై ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. ఆయన సినిమాలు ఇక్కడ రిలీజైన భారీ రేంజ్లో కలెక్షన్లు రావు. అయితే ఈ సారి పోటీ గట్టిగా ఉంది. ప్రమోషన్లలో ఏ మాత్రం కూల్గా ఉన్నా మొదటికే మోసం వస్తుంది.