Poonam Bajwa | చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ పూనమ్ బజ్వా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అప్పుడెప్పుడో 2005లో నవదీప్ హీరోగా వచ్చిన మొదటి సినిమా అనే చిత్రంతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత బాస్, పరుగు సినిమాలతో మెప్పించింది. ఆ వెంటనే సేవల్ చిత్రంతో కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన పూనమ్.. తెలుగు ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. అప్పుడప్పుడు తమిళ, మలయాళ చిత్రాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా మారేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఈమెకు చెప్పుకోదగ్గ హిట్ మాత్రం దక్కలేదు. ఈ క్రమంలో చాలా గ్యాప్ తర్వాత కోలీవుడ్లో ఈమె గురుమూర్తి అనే సినిమాలో నటించింది. నట్టి నటరాజ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూనమ్ బజ్వా.. ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.
సినిమాల్లో అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ.. సోషల్మీడియా ద్వారా పూనమ్ బజ్వా ప్రేక్షకులకు దగ్గరగానే ఉంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతోంది. ఇదే విషయంపై పూనమ్ బజ్వాకు ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందించిన పూనమ్.. ఫేస్బుక్లో దక్షిణాది నుంచి ఎక్కువమంది ఫ్యాన్స్ ఉన్నారని.. వాళ్లంతా తనను చాలా గ్లామరస్గా చూసేందుకు ఇష్టపడుతున్నారని చెప్పుకొచ్చింది. ఆ ఫొటోలు చూసి వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టే గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తున్నానని స్పష్టం చేసింది. అయితే గ్లామర్ షోకి.. స్కిన్ షోకి చాలా వ్యత్యాసం ఉందని పూనమ్ బజ్వా తెలిపింది. తాను గ్లామర్ షో మాత్రమే చేస్తున్నానని.. ఎప్పుడూ పరిధి దాటి ప్రవర్తించలేదని క్లారిటీ ఇచ్చింది.
ఇన్స్టాగ్రామ్లో బోల్డ్ ఫొటోలు ఎందుకు పెడుతున్నారని అడిగితే బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ ( Janhvi Kapoor ) కూడా ఇలాంటి సమాధానమే చెప్పింది. తను షేర్ చేసే ఫొటోలను ఎక్కువ మంది ఫ్యాన్స్ ఇష్టపడుతున్నారని.. దీని ద్వారా తనకు మరో బ్రాండ్ దక్కుతుందని తెలిపింది. దీనివల్ల ఈజీగా ఈఎంఐలు కట్టుకోవచ్చని వెల్లడించింది. ఇప్పుడు పూనమ్ బజ్వా కూడా ఫ్యాన్స్ ఇష్టపడుతున్నారు కాబట్టే ఇలా గ్లామర్ షో చేస్తున్నానని చెప్పుకొచ్చింది.
“Poonam Bajwa | సరికొత్త పోజులతో మదిని దోచుకుంటున్న పూనమ్ బజ్వా..”