Pooja Hegde | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు సంబంధించి ఒక వార్త వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. పూజా హెగ్డేని చంపేస్తామని బెదిరింపులు వచ్చాయని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. పూజా రీసెంట్గా దూబాయ్ వెళ్లగా.. ఆక్కడ ఒక ఈవెంట్లో ఆమె గొడవ పడిందని.. ఈ కారణంగా పూజాకు హత్యా బెదిరిపులు వచ్చాయని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో పూజ ఫ్యాన్స్ ఆందోళన చెందారు. అయితే తాజాగా ఈ వార్తలపై పూజా టీమ్ స్పందించింది.
పూజా హెగ్డేని చంపేస్తామని వచ్చిన బెదిరింపులు అబద్దమని పూజా టీమ్ తెలిపింది. ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని హీరోయిన్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఈ ఫేక్ ప్రచారాలు ఎవరు స్టార్ట్ చేశారో తెలియదు. అదంతా పూర్తిగా అవాస్తవం అని పూజా టీమ్ చెప్పుకోచ్చింది.
ప్రస్తుతం పూజా హెగ్డే ‘కోయి షక్’ అనే బాలీవుడ్ సినిమా చేస్తుంది. షాహిద్ కపూర్ హీరోగా వస్తున్న ఈ సినిమాను మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రూస్ తెరకెక్కిస్తున్నాడు.