నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ఒక లైలా కోసంతో పరిచయమై.. ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంటూ ముందుకు సాగుతున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కానుంది. మరోవైపు ఈమె చిరంజీవి ’ఆచార్య’లో రామ్ చరణ్ సరసన నటిస్తోంది. ఇంకోవైపు అఖిల్ తో చేసిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ విడుదలకు సిద్ధంగా ఉంది.
తెలుగులోనే కాక తమిళం, హిందీ భాషలలోను సత్తా చాటుతుంది పూజా హగ్డే. తమిళంలో దళపతి విజయ్ సరసన భీస్ట్
చిత్రంలో నటిస్తుంది. మరోవైపు తెలుగులో మహేష్- త్రివిక్రమ్ చిత్రంలో హీరోయిన్గా ఎంపికైంది. త్రివిక్రమ్ తెరకెక్కించిన అల వైకుంఠపురములో మెరిసిన పూజా మళ్లీ త్రివిక్రమ్ సినిమాకు హీరోయిన్గా కన్ఫాం అయింది.
టాప్ హీరోలకు గోల్డెన్ బ్యూటీగా మారిన పూజా హెగ్డే.. అల్లు అర్జున్ నటించనున్న ఐకాన్లోను కథానాయికగా నటించనుందని, ఇది దాదాపు కన్ఫాం అని అంటున్నారు. పుష్ప సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న అల్లుఅర్జున్ త్వరలోనే తన తదుపరి చిత్రం అయిన “ఐకాన్” ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కోసం ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నారు. అందులో ఒకరు పూజా కాగా మరొకరు ఎవరన్నది తెలియాల్సి ఉంది.