Actress Pooja Hegde | నిన్న,మొన్నటి వరకు సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు పూజా హెగ్డే. ఆమె సినిమా చేసిందంటే కోట్లు కొల్లగొట్టడం ఖాయం అనే మాట కూడా అప్పట్లో వినిపించింది. స్టార్ హీరోలు సైతం ఏరి కోరి పూజానే కావాలన్నారంటే ఆమె ఎంత లక్కీ చార్మో అర్థం చేసుకోవచ్చు. అయితే అదంతా రెండేళ్ల కిందటి ముచ్చట. గత రెండేళ్లుగా పూజా సినీ కెరీర్ చూసుకుంటే ఒక్క హిట్ కూడా లేదు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ తర్వాత పూజా నటించిన 6 సినిమాలు పెవీలియన్ బాట పట్టాయి. సౌత్లో ఫ్లాపులు పలకరిస్తున్నాయని నార్త్కు వెళ్తే.. నార్త్లో కూడా ఇదే పరిస్థితి.
గంపెడంతో ఆశలు పెట్టుకున్న ‘సర్కస్’ తొలిరోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ ఘోరంగా ఫ్లాప్ అయింది.ఇక ఎంతో ఇష్టపడి కష్టపడి చేసిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సైతం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే వరుస డిజాస్టర్లు పలకరిస్తున్నా పూజాకు మాత్రం అవకాశాలు కూడా బానే వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలుండగా.. లేటెస్ట్గా బాలీవుడ్లో మరో ఆఫర్ పట్టేసింది ఈ బ్యూటీ. షాహిద్ కపూర్ హీరోగా చేయబోయే ‘కోయి షక్’లో పూజానే హీరోయిన్గా ఎంపికయ్యిందని టాక్. ఈ సినిమాను మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రూస్ తెరకెక్కిస్తున్నాయి. మలయాళంలో ఆయన సినిమాలకు తిరుగులేదు. మోహన్లాల్, దుల్కర్, పృథ్విరాజ్ వంటి హీరోలకు బ్లాక్ బస్టర్ సినిమాలిచ్చాడు.
ప్రస్తుతం పూజా తెలుగులో SSMB28 సినిమా చేస్తుంది. మహేష్బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నాలుగో షెడ్యూల్ కోసం ముస్తాబవుతుంది. ఇక ప్రస్తుతం మహేష్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్కు వెళ్లాడు. ఇక వెకేషన్ నుంచి రాగానే కొత్త షెడ్యూల్ ప్రారంభంకానుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు.