Pooja Hegde | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ అందాల భామల జాబితాలో టాప్లో ఉంటుంది పూజా హెగ్డే (Pooja Hegde). ఈ టాలీవుడ్ బుట్టబొమ్మ నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందంటే క్రేజ్ మామూలుగా ఉండదు. పూజా హెగ్డే సినిమాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ నెట్టింట ఇంట్రెస్టింగ్ న్యూస్ షేర్ చేస్తూ.. అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తుంది. తాజాగా ఈ భామకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ పొడుగుకాళ్ల సుందరి ఇవాళ ఉదయం స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) ఇంటి దగ్గర ప్రత్యక్షమైంది.
అయితే ఎవరూ ఊహించిన విధంగా సడెన్గా ఇలా కనిపించడంతో.. ఈ విజిట్ పూజా నెక్ట్స్ అట్లీ చేయబోయే సినిమా కోసమేనంటూ తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. ప్రస్తుతానికైతే అట్లీ ఇంటికెళ్లడం వెనుకున్న సీక్రెట్ ఏంటనేది మిస్టరీగా మారింది. జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్న అట్లీ ఇటీవలే షారుఖ్ఖాన్, విజయ్తో మల్టీస్టారర్ చేస్తారని ప్రకటించాడని తెలిసిందే. పూజాహెగ్డే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసమే మంతనాలు జరుపుతుందంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి.
దీనిపై ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. పూజాహెగ్డే ఖాతాలో ప్రస్తుతం హౌస్ఫుల్ 5 ఉంది. ఈ చిత్రం 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీలో దేవ ప్రాజెక్ట్ చేస్తుండగా.. చిత్రీకరణ దశలో ఉంది. పూజాహెగ్డే 2020లో వచ్చిన అల వైకుంఠపురంలో గ్రాండ్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తర్వాత మళ్లీ సరైన బ్రేక్ అందుకోవాలని కసిగా ఎదురుచూస్తోంది.