మంగళూరు సోయగం పూజాహెగ్డేకు అవకాశాలైతే వస్తున్నాయి కానీ..కోరుకున్న స్థాయిలో విజయాలు మాత్రం దక్కడం లేదు. ఈ ఏడాది ఈ భామకు చేదు జ్ఞాపకాల్ని మిగిల్చింది. రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ చిత్రాల పరాజయంతో పూజాహెగ్డే గ్రాఫ్ పడిపోయింది. పవన్కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్సింగ్’ చిత్రం నుంచి కూడా ఈ అమ్మడు తప్పుకుందనే వార్తలొచ్చాయి.
అవకాశాలు తగ్గినా ఫర్వాలేదు కానీ పారితోషికం విషయంలో రాజీపడొద్దనే ధోరణి వల్లే ఆమెకు సినీ అవకాశాలు చేజారిపోతున్నాయని చెబుతున్నారు. ఈ విషయంపై పూజాహెగ్డే మాట్లాడుతూ ‘నా గురించి బయట ప్రచారంలో ఉన్న వార్తలన్నీ అవాస్తవాలే. పారితోషికం గురించి నేను పట్టించుకోను. అలా అయితే వరుసగా సినిమాలు అంగీకరించేదాన్ని. కథ నచ్చితేనే సినిమాలు చేస్తున్నా. ఎప్పటికైనా సినిమాల ఎంపికలో కథకే ప్రాధాన్యతనిస్తా. ఈ సంగతి తెలుసుకొని మాట్లాడాలి’ అని చెప్పింది.