Pooja Hegde | సినీ ఇండస్ట్రీలో బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. హీరోయిన్గా బిజీగా ఉంటూనే ఐటెం సాంగ్స్ ద్వారా కూడా తన ప్రత్యేకతను చాటుకుంటుంది. మొన్నటికి మొన్న రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన “కూలీ” సినిమాలో “మోనికా లవ్ యూ మోనికా” పాటతో ప్రేక్షకులను అలరించిన పూజా హెగ్డే, ఇప్పుడు మరోసారి స్పెషల్ సాంగ్ కోసం సిద్ధమవుతున్నట్లు సమాచారం. పూజా
“రంగస్థలం”లో “జిగేల్ రాణి”గా కూడా మెరిసింది. ఆ తర్వాత “F3”లో కూడా స్పెషల్ సాంగ్లో తన గ్లామర్తో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. హీరోయిన్గా లీడ్ రోల్స్ చేస్తూనే మరోవైపు ఐటెం సాంగ్స్ చేస్తూ రెండు వైపులా క్రేజ్, సంపాదన పెంచుకుంటోందని టాక్.
తాజా సమాచారం ప్రకారం, టాలీవుడ్, కోలీవుడ్ కలయికలో భారీ అంచనాలతో రూపొందుతున్న అల్లు అర్జున్ – అట్లీ ప్రాజెక్ట్లో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేయబోతోందట. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన చర్చ కోలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఈ సినిమా దాదాపు ₹800 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతోందని వార్తలు వస్తున్నాయి. దీపికా పదుకొనె హీరోయిన్గా, మృణాల్ ఠాకూర్ మరో కీలక పాత్రలో నటించనుందన్న బజ్ ఉన్నా, చిత్ర బృందం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఇక అల్లు అర్జున్ – పూజా హెగ్డే కాంబినేషన్ ఇప్పటికే రెండు బ్లాక్బస్టర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించింది .
దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురములో చిత్రాలతో మంచి విజయాలని అందించిన ఈ జంటను మళ్లీ తెరపై చూడాలనుకుంటున్న ఫ్యాన్స్కి ఇది గుడ్ న్యూస్గా మారింది. ఇక ఈ స్పెషల్ సాంగ్ కోసం పూజా హెగ్డే ₹5 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందన్న టాక్ ఫిలింసర్కిల్స్లో వినిపిస్తోంది. అయితే ఈ వార్తపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.తమన్నా భాటియా మాదిరిగానే హీరోయిన్గా, స్పెషల్ సాంగ్స్లోనూ మెరుస్తూ పూజా హెగ్డే తన మార్కెట్ను నిలబెట్టుకుంటోందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు అట్లీ సినిమా కోసం ఆమె తీసుకున్న ఈ నిర్ణయం కెరీర్లో టర్నింగ్ పాయింట్ అవుతుందేమో చూడాలి.