తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్స్ లో పూజా హెగ్డే ముందుంటుంది. ఇంకా చెప్పాలంటే నెంబర్ వన్ హీరోయిన్ ఈమె ఇప్పుడు. స్టార్ హీరోలందరితోనూ చాలా తక్కువ సమయంలోనే జోడీ కట్టింది. అల్లు అర్జున్ నుంచి మొదలు పెట్టి ప్రభాస్ వరకు దాదాపు అందరు హీరోలను చుట్టేసింది. పవన్ కళ్యాణ్ మాత్రమే ఇప్పుడు బ్యాలెన్స్ ఉన్నాడు. తాజాగా ఆచార్యలో రామ్ చరణ్ కు జోడీగా నటిస్తుంది పూజా. కెరీర్ లో బిజీగా ఉన్న ఈమె ఇప్పుడు కోవిడ్ కారణంగా ఇంటికే పరిమితం అయిపోయింది. కొన్ని రోజులుగా షూటింగ్స్ అన్నీ ఆపేయడంతో ఇంటి దగ్గరే ఉంటుంది పూజా. అయితే ప్రస్తుతం ఈమెకు గుండె పగిలే న్యూస్ ఒకటి తెలిసింది. తనకు చదువు చెప్పిన ఫేవరేట్ టీచర్ ఒకరు అనారోగ్యంతో కన్నుమూసారు. ఢిల్లీలోని మానెక్ జీ కూపర్ స్కూల్ లో చదువుకుంది పూజా హెగ్డే. అందులో ఆమెకు బాగా యిష్టమైన టీచర్ జెసికా దరువాలా.
ఈమె చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న పూజా.. కన్నీటి పర్యంతమైంది. తనకు ఇష్టమైన ఉపాధ్యాయురాలి మృతి తట్టుకోలేకపోతున్నానని చెప్పుకొచ్చింది ఈమె. అంతేకాదు తను ఎప్పుడు నిరాశలో ఉన్నా కూడా ఈమె వచ్చి ధైర్యం చెప్పేదని.. జీవితంలో కుంగిపోవడం కంటే ఓటమి మరోటి లేదని ధైర్యం చెప్పేదని గుర్తు చేసుకుంది పూజా హెగ్డే. ఈ ప్రపంచం ఓ రత్నాన్ని కోల్పోయిందని తెలిపింది . తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం ఓ రకంగా టీచర్ కూడా అని చెప్పింది పూజా హెగ్డే. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలియచేసింది ఈ ముద్దుగుమ్మ. జెసికా టీచర్ బయోగ్రఫీ చెప్పేవారని.. తన విజయానికి కారణమైన టీచర్ మరణం తనకు తీరనిలోటు అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది పూజా. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.