మహేష్బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘గుంటూరు కారం’ చిత్రం నుంచి పూజా హెగ్డే తప్పుకుందని తెలిసింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ షెడ్యూల్స్ అనుకున్న ప్రకారం జరగకపోవడంతో డేట్స్ సర్దుబాటు చేయలేక ఆమె ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. ‘ప్రస్తుతం పూజాహెగ్డే తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఒక్కో చిత్రానికి అంగీకరిచింది.
త్వరలో ఈ సినిమాలు సెట్స్మీదకు వెళ్లనున్నాయి. ఈ నేపథ్యంలో డేట్స్ క్లాష్ కావొద్దనే ఉద్దేశ్యంతో ‘గుంటూరు కారం’ చిత్రం నుంచి తప్పుకుంది’ అని పూజాహెగ్డే సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమా నుంచి పూజాహెగ్డే తప్పుకోవడంతో సెకండ్లీడ్లో నటిస్తున్న శ్రీలీలను ప్రధాన నాయికగా తీసుకోబోతున్నారని సమాచారం. ‘గుంటూరు కారం’ తదుపరి షెడ్యూల్ ఈ నెలాఖరులో మొదలుకానుంది. వచ్చే ఏడాది జనవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.