అగ్ర కథానాయిక పూజాహెగ్డేకు గత రెండేళ్లుగా అదృష్టం కలిసిరావడం లేదు. తెలుగు, హిందీ భాషల్లో వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. అయితే సినిమాల విషయంలో అంకితభావంతో పనిచేస్తానని, జయాపజయాల గురించి ఎక్కువగా ఆలోచించనని చెబుతుంటుంది పూజాహెగ్డే. ఆమె నటించిన తాజా బాలీవుడ్ చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేదు. దాంతో బాలీవుడ్లో ఇక ఈ అమ్మడి కెరీర్ ముగిసినట్లేనని భావించారు. అయితే అందరి అంచనాలకు భిన్నంగా ఈ భామ హిందీలో మరో బంపరాఫర్ను దక్కించుకుంది.
అగ్ర హీరో షాహిద్కపూర్ సరసన పూజాహెగ్డే ఓ యాక్షన్ థ్రిల్లర్లో నాయికగా ఎంపికైంది. జీ స్టూడియోస్ పతాకంపై సిద్ధార్థ్రాయ్ కపూర్ నిర్మించే ఈ చిత్రానికి రోషన్ ఆండ్రివ్స్ దర్శకత్వం వహించబోతున్నారు. ‘కోయి షా’ అనే టైటిల్ను ఖరారు చేశారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ చిత్రమిదని, కథానాయిక పాత్ర కీలకంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ప్రస్తుతం పూజాహెగ్డే తెలుగులో మహేష్బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.