Pooja Hegde Grandmother | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తన అమ్మమ్మను తలచుకొని ఎమోషనల్ అయ్యింది. పూజా హెగ్డే అమ్మమ్మ రెండేళ్ల క్రితమే మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని నేడు తలచుకుంటూ బుట్ట బొమ్మ ఇన్స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ”నిన్ను మిస్ అవుతున్న అజ్జి నీతో గడిపిన ఆ మధుర క్షణాలను ఎప్పటికి మరచిపోలేను” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారగా.. ఈ బుట్ట బొమ్మను అభిమానులు ఓదార్చుతున్నారు.
ఇక పూజా హెగ్డే సినిమాల విషయానికి వస్తే.. గతేడాది బాలీవుడ్లో సల్మాన్ ఖాన్తో కలిసి కిసీ కా భాయ్ కిసి కీ జాన్ చిత్రంలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మిగిలింది. ఆ తర్వాత తెలుగులో మహేశ్తో గుంటూరు కారం సినిమాలో ఛాన్స్ కొట్టేసినప్పటికీ ఆ తర్వాత సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు అనౌన్స్ చేసింది. ప్రస్తుతం బుట్టబొమ్మ చేతిలో సినిమాలు ఏమీ లేవు.