‘నా కెరీర్లో బెస్ట్ కేరక్టర్ ‘దేవా’లో చేస్తున్నాను. డైరెక్టర్ రోషన్కు థ్యాంక్స్. ఓ ఇరవైఏళ్ల తర్వాత నా గురించి మాట్లాడాల్సొస్తే ముందు ‘దేవా’లోని పాత్ర గురించే మాట్లాడతారు’ అంటున్నది అందాలరాశి పూజాహెగ్డే. షాహిద్ కపూర్ కథానాయకుడిగా నటిస్తున్న ‘దేవా’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న పూజా.. ఇందులోని తన పాత్ర గురించి మీడియాతో మాట్లాడింది. ‘అభినయానికి ఆస్కారమున్న పాత్రలు చాలా చేశాను. కానీ ఒక నటిగా నా ఆకలి మాత్రం అవి తీర్చలేకపోయాయి.
జీవితంలో ఓ అసంతృప్తి ఉండేది. ఆ లోటుని ‘దేవా’ భర్తీ చేసేసింది. ఇందులో మధ్యతరగతి యువతిగా నటిస్తున్నాను. నా పాత్రలో ఎన్నో సంఘర్షణలుంటాయి. కథలో కీలకమైన పాత్ర. ఓ విధంగా ఇది నా కథ. మంచి అవకాశం ఇచ్చిన రోషన్కీ, హీరో షాహిద్కీ థ్యాంక్స్..’ అని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే. రాయ్ కపూర్ ఫిలింస్, జీ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది దసరాకి విడుదల కానుంది.