Ponniyin Selvan part-2 censor | మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్స్లో ‘పొన్నియన్ సెల్వన్-2’ ఒకటి. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక గతేడాది సెప్టెంబర్ చివరివారంలో రిలీజైన పార్ట్-1 ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తమిళనాట కాసుల వర్షం కురిపించింది. డిస్ట్రిబ్యూటర్లకు కళ్లు చెదిరే లాభాలు తీసుకొచ్చింది. అయితే మిగితా భాషల్లో మాత్రం బోటా బోటీ మార్కులతోనే సరిపెట్టుకుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సీక్వెల్పై కోలీవుడ్లో యమ క్రేజ్ ఉంది. బుకింగ్స్ ఓపెనవడమే లేటు.. టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతాయని చిత్రబృందం వెల్లడిచింది. కాగా తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.
పొన్నియన్ సెల్వన్-2 సెన్సార్ యూ/ఏ సర్టిఫికేట్ను జారి చేసింది. రన్టైమ్ 2 గంటల 44 నిమిషాలుగా ఉండనుంది. తొలిపార్టు కూడా దగ్గరదగ్గరగా ఇదే రన్టైమ్తో రిలీజైంది. కాగా అప్పుడు సినిమా చాలా లెంగ్తీగా ఉందని, కొన్ని సీన్లు కట్ చేసి ఉండాల్సిందని, ప్రేక్షకుడి సహానానికి ఇదో పరిక్ష అంటూ పలువురు కామెంట్స్ చేశారు. ఇక మళ్లీ మణరత్నం అంత లెంగ్తీ రన్టైమ్తో వస్తున్నాడంటే రిస్క్ అనే చెప్పాలి. ఈ సారి ఏదో మేజిక్, వండర్స్, గ్రటా చేసి కూర్చోబెట్టాల్సిందే తప్ప.. ప్రేక్షకులు అంత లెంగ్తీ టైమ్ ఉన్న సినిమాను చూడాలంటే ఈ మధ్య ఒకటికి పది సార్లు ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు.
చియాన్ విక్రమ్, కార్తి, జయంరవి, త్రిష, ఐశ్వర్యరాయ్ వంటి భారీ తారగణంతో తెరకెక్కిన ఈ సినిమాను మణిరత్నం కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా తెరకెక్కించాడు. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్తో కలిసి మ్రదాస్ టాకీస్ బ్యానర్పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. అయితే తెలుగులో మాత్రం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోకుండానే థియేటర్లలో నుండి వెళ్లిపోయింది.