Bengaluru Rave Party | బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ నటి హేమకు పోలీసులు నోటీసులు పంపారు. రేవ్ పార్టీ కేసు విచారణలో భాగంగా కర్ణాటక పోలీసులు హేమకి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ డ్రగ్స్ టెస్ట్లో హేమకి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ హేమతో పాటు హేమతో పాటు మొత్తం 86 మందికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు ప్రకటించారు. దీంతో హేమతో పాటు పలువురికి బెంగళూరు పోలీసులు నోటీసులు పంపారు. వీరందరూ ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు. ఇక నోటీసులు అందుకున్న వారిలో హేమతో పాటు కాంతి, సుజాత, రాజశేఖర్, చిరంజీవి, ఆషీరాయ్, రిషి చౌదరి, ప్రసన్న, శివాని, జైశ్వాల్, వరుణ్ చౌదరి తదితరులు ఉన్నారు.