శ్రీకాంత్ శ్రీరామ్ , ఖుషీ రవి జంటగా నటిస్తున్న చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉపశీర్షిక. సాయికిరణ్ దైదా దర్శకుడు. యశ్వంత్ దగ్గుమాటి నిర్మాత. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నది.. ఆదివారం హైదరాబాద్లో ఈ చిత్రం టీజర్ని విడుదల చేశారు. ‘ ఇదొక విభిన్నమైన హారర్ సినిమా. మమ్మల్ని భయపెట్టలేరు అని మనసులో అనుకొని రండి. ఖచ్చితంగా మిమ్మల్ని భయపెడతాం. ఇందులో అనవసరమైన పాటలు, డబుల్మీనింగ్ డైలాగులు ఉండవు. కేవలం కంటెట్ని నమ్ముకొని తీసిన సినిమా ఇది’ అని శ్రీరామ్ అన్నారు. సినిమా తీయడానికి భయపడుతున్న రోజుల్లో భయపెట్టే సినిమా తీసిన మేకర్స్కి నా అభినందనలు.
దర్శకుడు సాయికిరణ్కి మంచి పేరు తెచ్చే సినిమా ఇది అని కోనవెంకట్ నమ్మకం వ్యక్తం చేశారు. ‘యదార్థ సంఘటన ఆధారంగా అల్లిన హారర్ కథ ఇది. సినిమా చూశాక ఈ సినిమాకు ‘పిండం’ అనే టైటిలే కరెక్ట్ అని అందరూ ఒప్పుకుంటారు. మనిషి ఆరంభం నుంచి అంతం వరకూ ముడిపడి ఉండే టైటిల్ ఇది. అందరి సహకారంతో సినిమా తీయగలిగాను’ అని దర్శకుడు చెప్పారు. ఇంకా బీవీఎస్ రవి, శ్రీనివాస్ అవసరాలతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు.