2021లో మర్డర్ మిస్టరీ కథాంశంతో వచ్చి ఓటీటీలో బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం ‘హసీన్ దిల్రుబా’. బాలీవుడ్ భామ తాప్సీ పన్ను (Taapsee Pannu), విక్రాంత్ మాస్సే (Vikrant Massey) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం నేరుగా నెట్ఫ్లిక్స్లో విడుదలై మంచి రికార్డు వ్యూస్ సాధించింది. అయితే ఈ సూపర్ హిట్ మూవీకి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా’(Phir Aayi Hasseen Dillruba) అంటూ ఈ సినిమా రానుండగా ఫస్ట్ పార్ట్లో నటించిన విక్రాంత్ మాస్సే (Vikrant Massey), తాప్సీ (Taapsee), ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జయ్ప్రద్ దేశాయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ మూవీ షూటింగ్ పూర్తయినట్లు చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దీనితో పాటు ఒక ఫొటో కూడా పంచుకుంది. ఇక సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాను కనికా థిల్లాన్ నిర్మిస్తుంది. బాలీవుడ్ నటుడు సన్నీ కౌశల్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.