Sarkaru Vaari Paata | సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల వేగాన్ని తగ్గించాడు. సరిలేరు నీకెవ్వరు తరువాత ఈయన నుంచి మరో సినిమా రాలేదు. వెండి తెరపై మహేష్బాబు కనిపించి రెండేళ్ళు దాటింది. అభిమానులు ఈయన నుంచి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈయన నటిస్తున్న లేటెస్ట్ చిత్రం సర్కారు వారి పాట. గీతాగోవిందం ఫేం పరుశురాం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటంగ్ను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఎదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది. తాజాగా ఈ చిత్రంలోని ‘పెన్నీ’ సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు.
ఇదివరకే విడుదలైన ‘కళావతి’ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. యూట్యూబ్లో ఈ పాట ఇప్పటివరకు తొమ్మదిన్నర కోట్ల మంది వీక్షించారు. టాలీవుడ్లోనే హైయెస్ట్ ఫాస్ట్ వ్యూవుడ్ లిరికల్ సాంగ్గా కళావతి రికార్డు సాధించింది. తాజాగా ఈ చిత్రంలోని పెన్నీ అనే పెప్పి సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో మహేష్బాబు కూతురు సితార కూడా నర్తించడం విశేడం. సితార నర్తించిన ఈ పాటను మర్చి 20న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రొమోలో ప్రకటించారు.
బ్యాంక్ మోసాల నేపథ్యంలో తెరకెక్కుతున్న బ్యాంక్ మోసాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14రీల్స్ ఎంటర్టైనమెంట్స్ సంస్థలతో కలిసి జీఎంబీ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై మహేష్బాబు స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్బాబుకు జోడిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మే 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.