Payal Rajput | ‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో యువతరంలో మంచి ఫాలోయింగ్ను సంపాదించుకుంది పాయల్ రాజ్పుత్. అయితే ఆ క్రేజ్ను ఎక్కువ కాలం నిలుపుకోలేక పోయిందీ భామ. వరుస వైఫల్యాలతో రేసులో వెనకబడింది. కథాంశాల ఎంపికలో జరిగిన కొన్ని పొరపాట్ల వల్ల అపజయాలను చవిచూడాల్సి వచ్చిందని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. ఆమె మాట్లాడుతూ ‘పంజాబీ చిత్రసీమలో మంచి పేరు సంపాదించుకున్న తర్వాత తెలుగు ఇండస్ట్రీకి వచ్చాను. తొలి సినిమా విషయంలో నా అంచనాలన్నీ నిజమయ్యాయి.
ఆ తర్వాత ఎంచుకున్న కథలు ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నా. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా ఆశావాహ ధృక్పథంతో ముందుకు సాగాలన్నదే నా సిద్ధాంతం’ అని చెప్పుకొచ్చింది. తెలుగులో మహేష్బాబు తన అభిమాన నటుడని, ఆయనతో కలిసి నటించాలన్నది చిరకాల కోరికని పాయల్ రాజ్పుత్ పేర్కొంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో పాన్ ఇండియా చిత్రం ‘మంగళవారం’లో కథానాయికగా నటిస్తున్నది.