ముంబై: దర్శకుడు అనురాగ్ కశ్యప్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన బాలీవుడ్ నటి పాయల్ ఘోష్పై యాసిడ్ దాడి జరిగింది. మాస్క్ వేసుకుని వచ్చిన కొందరు తనపై యాసిడ్ దాడి చేసినట్లు ఆమె చెప్పింది. ముంబైలో ఓ షాపుకు వెళ్లి మందులు కొనుక్కొని వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కారులో కూర్చుంటున్న సమయంలో ఓ రాడ్డుతో కొందరు దాడి చేశారని, అదే సమయంలో వాళ్ల చేతుల్లో ఓ బాటిల్ ఉందని, బహుశా అది యాసిడ్ అయి ఉంటుందని ఆమె అన్నారు. ఆ దాడి నుంచి తప్పించుకున్నానని, ఎడమ చేతికి స్వల్పంగా గాయమైనట్లు ఆమె చెప్పింది. ఈ విషయంలో పోలీసు కేసు నమోదు చేయనున్నట్లు ఆ నటి వెల్లడించింది. తనపై జరిగిన దాడికి సంబంధించిన అంశాలను వెల్లడిస్తూ ఇన్స్టాలో పాయల్ ఓ వీడియో పోస్టు చేసింది.