Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ షూటింగ్లలో తీరిక లేకుండా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఈయన నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు. ఇటీవలే ఈయన నటించిన ‘భీమ్లానాయక్’ విడుదలై మంచి కలెక్షన్లను సాధించింది. ప్రస్తుతం ఈయన క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. దీని తర్వాత ‘వినోదయ సిత్తం’ రీమేక్ను చేయనున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది.
‘వినోదయ సిత్తం’ షూటింగ్ జూన్లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. తమిళంలో దర్శకత్వం వహించిన సముద్రఖని తెలుగు వెర్షన్కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు నేటివిటీ తగ్గట్లు త్రివిక్రమ్ కథలో మార్పులు చేశాడని టాక్. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇక పవన్ ఈ చిత్రం కోసం కేవలం 20రోజులు మాత్రమే కాల్షీట్లు ఇచ్చినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు.