అగ్ర హీరో పవన్కల్యాణ్ కొత్త సినిమా ప్రకటన ఆదివారం వెలువడింది. ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ తెరకెక్కించబోతున్న ఈ చిత్రానికి ‘సాహో’ ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. దీనిపై ‘ఫైర్ స్ట్రామ్ ఇజ్ కమింగ్’ అనే క్యాప్షన్ను జోడించారు. పోస్టర్ మీద ‘దే కాల్ హిమ్ ఓజీ’ అని రాసి ఉంది. గ్యాంగ్స్టర్ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారని సమాచారం.
ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఈ చిత్రానికి రవి.కె.చంద్రన్ సినిమాటోగ్రాఫర్గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తామని చిత్రబృందం పేర్కొంది. ప్రస్తుతం పవన్కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తుస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటున్నది.