Pawan Kalyan | పహల్గాంలో ఉగ్రవాదులు సృష్టించిన అరాచకానికి భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టగా, ఇది విజయవంతమైన నేపథ్యంలో విజయవాడ నగరం దేశభక్తి నినాదాలతో మార్మోగింది. ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ జరగగా, ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ఈ భారీ ప్రదర్శన కన్నుల పండువగా సాగింది. అయితే ఇక్కడ అందరి దృష్టి పవన్ కల్యాణ్ చేతిపైనే ఉంది.
అందుకు కారణం పవన్ ఎప్పుడు పట్టబొచ్చు పొడిపించుకుంది లేదు. ఆ మధ్య పవన్ చేతిపై త్రిశూలం టాటూ కనిపించింది. త్రిశూలం ఎందుకు వేసుకొన్నారనే విషయం అభిమానుల్లో మరింత ఆసక్తిని రేపింది.కాస్త ఆరా తీస్తే ఆ టాటూ హరిహర వీరమల్లు కోసం వేసుకున్నారని తెలిసింది. ఇక తిరంగా ర్యాలీలో పాల్గొన్న పవన్ చేతిపై కొత్త పచ్చబొట్టు కనిపించింది. ఆయన చేతిపై ఉన్న టాటూ స్పెషల్ అట్రాక్షన్ గా అందరి దృష్టిని ఆకర్శించింది. దీనిపై అనేక ఊహగానాలు వెలువడ్డాయి. ఆ టాటూ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటని.. ఆ టాటూకి అర్థం ఏంటని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఓజీ సినిమా కోసమే పవన్ కళ్యాణ్ ఆ టాటూ వేయించుకున్నారని , టాటూ మీనింగ్ కూడా ఓజీనే అని అంటున్నారు. కొద్ది రోజులుగా ఓజీ సినిమా షూటింగ్తో పవన్ బిజీగా ఉండగా, తిరంగా ర్యాలీ కోసం సెట్ నుండి డైరెక్ట్గా వచ్చేశారని తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్- సుజీత్ కాంబోలో వస్తున్న ఓజీ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా మాఫియా బ్యాక్డ్రాప్తో రూపొందుతోంది. ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. పవర్ఫుల్ యాక్షన్తో రాబోతున్న ‘OG’ సినిమాను ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై దానయ్య భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తోంది. అలాగే, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శ్రీయా రెడ్డి సహా ఎంతో మంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు.