Pawan Kalyan | టాలీవుడ్ స్టార్ హీరో, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఓ వైపు పొలిటికల్ కమిట్మెంట్స్తో బిజీ ప్లాన్ రెడీ చేసుకుంటూనే.. మరోవైపు సినిమాలు పూర్తి చేసే పనిపై కూడా ఫోకస్ పెట్టాడని తెలిసిందే. ఈ స్టార్ హీరో ఇటీవలే బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి.. బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్తో ఫుల్ ఖుషీ అవుతున్నారు నిర్మాతలు. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ నిర్మాతలకు కొత్త భారం పడుతుందన్న వార్త ఒకటి ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఈ భారం ఏ విషయంలోనో తెలుసా..?
2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పవన్ కల్యాణ్ విజయవాడ నుంచి చార్టెడ్ ఫ్లైట్లో వచ్చి వకీల్ సాబ్ షూటింగ్లో పాల్గొన్నాడని తెలిసిందే. దీనికోసం నిర్మాత దిల్ రాజు రోజు వారీగా భారీగానే ఖర్చు పెట్టాడని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ తర్వాత హైదరాబాద్ నుంచి పనిచేయడం మొదలుపెట్టాడు. గత నాలుగేళ్లుగా హైదరాబాద్ నుంచే సినిమా షూటింగ్లకు హాజరవుతూ వస్తున్నాడు.
అయితే ఏపీలో ఎన్నికలు (AP Politics) దగ్గర పడుతున్న నేపథ్యంలో తన బేస్ను విజయవాడకు మార్చేసి.. అక్కడి నుంచే సినిమా షూటింగ్స్ కు వెళ్లేలా ప్లాన్ చేసుకున్నాడని ఇప్పటికే న్యూస్ కూడా తెరపైకి వచ్చింది. తాజాగా నెట్టింట హల్ చల్ చేస్తున్న వార్తల ప్రకారం పవన్ కల్యాణ్ ప్రస్తుతం మంగళగిరి కేంద్రంగా తన సినిమా పనులు చక్కబెట్టుకోవాలన్న ఆలోచనలో ఉన్నాడని టాక్ వినిపిస్తోంది.
పవన్ కల్యాణ్ ఇక ఓజీ (OG), ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) షూటింగ్స్ మొదలుపెడితే.. నిర్మాతలు డీవీవీ దానయ్య, నవీన్ యేర్నేని ఆయన కోసం ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ లెక్కన మంగళగిరి నుంచి హైదరాబాద్ వచ్చి వెళ్లాలంటే రోజువారిగా నిర్మాతలకు భారీగానే ఆర్థిక భారం పడటం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే పవర్ స్టార్ క్రేజ్ను దృష్టిలో పెట్టుకొని ఎంత భారమైనా భరించేందుకు నిర్మాతలకు వెనకాడే పరిస్థితులు కూడా ఏమీ ఉండవన్న టాక్ కూడా నడుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హరిహరవీరమల్లు కూడా చేస్తుండగా.. దీనికి సంబంధించిన కొత్త అప్డేట్ రావాల్సి ఉంది.