రాజకీయాలకు కాస్త బ్రేక్నిచ్చి ఇక వరుసగా తన సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు అగ్ర హీరో పవన్కల్యాణ్. ఇటీవలే ఆయన ‘ఓజీ’ షూటింగ్లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. ‘మళ్లీ మొదలైంది..ఈసారి ముగిద్దాం’ అంటూ చిత్ర బృందం సోషల్మీడియాలో చేసిన పోస్ట్తో అభిమానులు ఖుషీ అయ్యారు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ఇది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతున్నది. పవన్కల్యాణ్ ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్లో పాల్గొంటున్నారని, ఇది సినిమాకు హైలైట్గా నిలుస్తుందని చిత్రబృందం చెబుతున్నది. సాధ్యమైనంత తొందరలో ఈ సినిమాను పూర్తి చేయాలనే ఆలోచనలో పవన్కల్యాణ్ ఉన్నట్లు సమాచారం. ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు.