తన సినిమాల షూటింగ్లను శరవేగంగా పూర్తి చేసుకుంటూ వెళ్తున్నారు స్టార్ హీరో పవన్ కల్యాణ్. ఇటీవలే ‘ఉస్తాద్ భగత్సింగ్’ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసిన పవన్..ఇప్పుడు తన మరో కొత్త సినిమా ‘ఓజీ, ఒరిజినల్ గ్యాంగ్స్టర్’ ముంబై షెడ్యూల్ ఫినిష్ చేశారు. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ నాయికగా నటిస్తున్నది. ఇటీవలే ముంబైలో ఈ సినిమా తొలి షెడ్యూల్ ప్రారంభమైంది.
ఈ షెడ్యూల్లో యాక్షన్ ఎపిసోడ్స్తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ షూటింగ్ అప్డేట్ను చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. సినిమాలో అదిరిపోయే యాక్షన్ను చిత్రీకరించాం. పవన్ నటనలోని పవర్ను చూస్తారు అని పేర్కొంది. గ్యాంగ్స్టర్ నేపథ్య కథతో సుజీత్ తరహా సరికొత్త స్క్రీన్ప్లేతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తున్నది.