Mega Heroes | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘ఓజీ’ థియేటర్లలో రచ్చ చేస్తోంది. నిన్న రాత్రి ప్రీమియర్ షోలతో ప్రారంభమైన ఈ మూవీ ఫీవర్ సినీ ప్రేమికులతో పాటు సినీ ప్రముఖులను కూడా ఊపేసింది. ఈ సందర్భంగా మెగా కుటుంబ హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ కూడా తమ మామయ్య సినిమా చూడటానికి థియేటర్కి వెళ్లారు. అభిమానుల మధ్య కూర్చొని సినిమాని చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు. హైదరాబాద్లోని శ్రీరాములు థియేటర్లో జరిగిన ప్రీమియర్ షోకు వెళ్లిన వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ .. పవన్ ఎంట్రీ సీన్లలో ఫ్యాన్స్తో కలిసి పేపర్లు ఎగురవేస్తూ, కేరింతలు కొడుతూ మామూలు అభిమానుల్లా ఫుల్ ఎంజాయ్ చేశారు.
థియేటర్లో వారు చేసిన హంగామా అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ కూడా ఈ షోకి హాజరవడం విశేషం. అయితే మెగా హీరోల మాస్ మూమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సినిమా చూస్తూ వారు చేసిన హడావిడిని అభిమానులు తమ కెమెరాలలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “మా హీరోలతో కలిసి సినిమా చూశాం” అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు సుజీత్ టేకింగ్, సంగీత దర్శకుడు తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, పవన్ కల్యాణ్ శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి. ముఖ్యంగా పవన్ ఎంట్రీ, పవర్ఫుల్ డైలాగ్స్కు థియేటర్లు హోరెత్తిపోతున్నాయి. ఈ నేపథ్యంలో, ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద పండుగ వాతావరణాన్ని సృష్టిస్తోంది.
ప్రముఖులే అభిమానులుగా మారిన సందర్భాలు అరుదుగా కనిపిస్తాయి. మెగా హీరోలు పవన్ సినిమాను ఇంతలా ఆదరిస్తుండటంతో, అభిమానులకి ఇది చూడముచ్చటగా అనిపిస్తుంది. ప్రస్తుత ట్రెండ్ను బట్టి చూస్తే, ‘ఓజీ’ రికార్డుల దిశగా దూసుకెళ్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తొలి రోజు ఈ సినిమా వంద కోట్ల వరకు వసూళ్లు రాబట్టడం ఖాయం అని అంటున్నారు. పండగ సెలవులు కూడా తోడవడంతో పవన్ సినిమా రికార్డులు చెరిపేస్తుందని అంటున్నారు.
💖 పవన్ కళ్యాణ్ ఎంట్రీకి వరుణ్ తేజ్ ఇచ్చిన విసిల్ తో ఆ థియేటర్ vibe ఇంకో లెవల్ కి వెళ్ళింది #varuntej #theycallhimog pic.twitter.com/HJa4Zt5Mub
— Roll Media (@Rollmedia9) September 24, 2025
Mega Heros @IamSaiDharamTej and @IAmVarunTej enjoying the euphoria of #OG mania 💥💥💥#SaiDharamTej #VarunTej #PSPK #TheyCallHimOG #PopperStopTelugu pic.twitter.com/cWbQqIobPa
— Popper Stop Telugu (@PopperstopTel) September 24, 2025