వేగంగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు పవన్కళ్యాణ్. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా ‘ఓజీ’. సుజిత్ దర్శకత్వలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. పవన్కళ్యాణ్ లేని సన్నివేశాలను ఓ షెడ్యూల్గా చేసుకొని చిత్రీకరించారు సుజిత్. త్వరలోనే పవన్ ఈ షూటింగ్లో పాల్గొనబోతున్నట్టు తెలిసింది. ఈ నెల 27 నుంచి కాకినాడ పోర్ట్లో షూటింగ్ జరగనున్నట్టు సమాచారం.
అక్కడ పవన్పై కీలక సన్నివేశాలను తీస్తారట. ఈ షెడ్యూల్లో కథానాయిక ప్రియాంక మోహన్ కూడా పాల్గొనబోతున్నట్టు తెలిసింది. ఫస్ట్ గ్లింప్స్తోనే అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాడు సుజిత్. పవన్ కెరీర్లో అత్యధిక బడ్జెట్తో డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అర్జున్ దాస్, శ్రియా రెడ్డి ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం తమన్. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేస్తారు.