పవన్కల్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మలయాళంలో విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియం’ చిత్రానికి రీమేక్ ఇది. సాగర్ కె చంద్ర దర్శకుడు. కరోనా కారణంగా వాయిదా పడిన షూటింగ్ను సోమవారం నుంచి తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం పవన్కల్యాణ్, రానాలపై యాక్షన్ ఘట్టాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ‘భీమ్లానాయక్ ఆన్ డ్యూటీ’ క్యాప్షన్తో చిత్ర నిర్మాణ సంస్థ ట్విట్టర్లో ఓ ఫొటోను పోస్ట్ చేసింది. ఈ సినిమాలో పవన్కల్యాణ్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఈ చిత్రంలో నిత్యామీనన్, ఐశ్వర్యరాజేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. తమన్ స్వరకర్త.