పవన్ కల్యాణ్, సాయిధరమ్తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకుడు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్ప్లే, సంభాషణలందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం టీజర్ను విడుదల చేశారు. చీకటిలో చిక్కుకుపోయిన సాయిధరమ్తేజ్ తనను రక్షించేవారి కోసం ఎదురుచూడటం, చివరకు ‘బ్రో’ అనే పిలుపుతో పవన్కల్యాణ్ ప్రత్యక్షం అయ్యే సన్నివేశాలతో టీజర్ ఆసక్తికరంగా మొదలైంది. ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.
‘కాలం మీకు అంతుపట్టని ఇంద్రజాలం’ ‘సినిమాలు ఎక్కువ చూస్తావేంట్రా నువ్వు’ అంటూ పవన్కల్యాణ్ చెప్పిన సంభాషణలు మెప్పించాయి. వినోదాత్మక అంశాలతో టీజర్ను తీర్చిదిద్దారు. ‘ఫాంటసీ, ఆధ్యాత్మిక అంశాలతో కూడిన ఫ్యామిలీ డ్రామా ఇది. అభిమానులకు పండగలా ఉంటుంది’ అని చిత్ర బృందం పేర్కొంది. కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, సముద్రఖని, రోహిణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సుజీత్ వాసుదేవ్, సంగీతం: తమన్, స్క్రీన్ప్లే, సంభాషణలు: త్రివిక్రమ్, రచన, దర్శకత్వం: సముద్రఖని.