షారుఖ్ ఖాన్ సినిమా ‘పఠాన్’ బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న సంచలనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటిదాకా ఈ రికార్డ్ ‘బాహుబలి 2’ పేరిట ఉంది. ‘బాహుబలి 2’ బాలీవుడ్లో 511 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టగా..‘పఠాన్’ 513 కోట్ల రూపాయలతో దాన్ని దాటేసింది. ఈ సందర్భంగా ‘బాహుబలి’ చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ ‘పఠాన్’ చిత్రబృందాన్ని అభినందించారు.
ఆయన స్పందిస్తూ…‘బాహుబలి 2’ చిత్ర వసూళ్ల రికార్డును అధిగమించినందుకు ‘పఠాన్’ చిత్రబృందానికి, హీరో షారుఖ్ ఖాన్కు నా శుభాకాంక్షలు చెబుతున్నా. రికార్డులు ఉన్నవే చెరిపేందుకు, షారుఖ్ ఈ ఘనత సాధించడం సంతోషంగా ఉంది. అని అన్నారు. అటు ‘పఠాన్’ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ కూడా శోభు యార్లగడ్డ ట్వీట్కు ప్రతిస్పందించింది. ‘పఠాన్’ సినిమాను ఇంత భారీ స్థాయిలో నిర్మించేందుకు ‘బాహుబలి’ స్ఫూర్తినిచ్చిందని పేర్కొంది. ‘పఠాన్’ ప్రపంచవ్యాప్తంగా 1033 కోట్ల రూపాయలు ఆర్జించింది.