Parari Movie | కార్తీ జపాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ దర్శకుడు రాజు మురుగన్ తన తదుపరి ప్రాజెక్ట్ను అనౌన్స్ చేశాడు. అయితే ఈసారి దర్శకుడిగా కాకుండా నిర్మాతగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తన నిర్మాణంలో వస్తున్న తాజా చిత్రం పరారీ. ఈ సినిమాకు రాజు మురుగన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఎలిల్ పెరియవేడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హరి శంకర్, సంగీత కళ్యాణ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రీసెంట్గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
ఇక ఈ ఫస్ట్ లుక్ గమనిస్తే.. ఓ ప్రేమ జంటను గ్రామస్తులు తరిమికొడుతున్నట్లుగా ఉంది. ఇక బట్టలు లేకుండా ఉన్న ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. ఈ పోస్టర్ను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ విడుదల చేశాడు.
Honored to present the intense First Look of #Parari👣
My hearty wishes to @Ezhil_Periavedi bro, @RSeanRoldan bro, @Dir_Rajumurugan sir and the entire cast and crew of #Parari to be a big success🤗❤️ pic.twitter.com/glvDFHolll
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) November 23, 2023
ఈ సినిమాపై దర్శకుడు ఎలిల్ పెరియవేడి మాట్లాడుతూ.. కులం, భాష, మతాల ఆధారంగా సమాజంలో జరుగుతున్న సమకాలీన దుస్థితి గురించి ఈ చిత్రం చెబుతుందని.. ఈ మూడింటిని రాజకీయాలుగా వాడుకుంటున్న మానవ సమాజాన్ని ప్రశ్నించే విధంగా ఈ చిత్రం ఉండనుందని దర్శకుడు తెలిపాడు. ఇక ఈ సినిమా షూటింగ్ను బెంగళూరు, కృష్ణగిరి పరిసరల్లో కేవలం 45 రోజుల్లోనే పూర్తి చేసుకున్నట్లు చిత్రబృందం తెలిపింది.