Pawan Kalyan | పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పటి నుంచో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’ ఎట్టకేలకు జులై 24న థియేటర్లలో విడుదలైంది. ప్రీమియర్ షో సందర్భంగా బుధవారం అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద పవన్ ఫ్యాన్స్ హంగామా మొదలైంది. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, బాణసంచాతో సందడి చేస్తూ పండుగ వాతావరణం నెలకొల్పారు. పోస్టర్లకు పాలాభిషేకాలు చేస్తూ అభిమానులు తమ ఉత్సాహాన్ని బయటపెట్టారు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతున్నాయి. తాజాగా ఓ ఆసక్తికర సంఘటన వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ థియేటర్లో ‘హరి హర వీరమల్లు’ చూడటానికి వచ్చిన కొందరు మహిళలు సంప్రదాయ శారీల్లో, ముఖాలను చీరతో పూర్తిగా కప్పుకుని థియేటర్కి హాజరయ్యారు. సినిమా మొదలైన తర్వాత కూడా తమ ముఖాలు ఎవరికీ కనిపించకుండా జాగ్రత్త పడడం గమనార్హం. వీరి వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ సందర్భంలో నెటిజన్లు వీరంతా అనుపమ పరమేశ్వరన్ నటించిన కొత్త సినిమా ‘పరదా’ ప్రమోషన్ కోసమే ఇలా వేషధారణలో హాజరయ్యారని అంటున్నారు.
ఈ ఐడియా కొత్తగా ఉందని, పవన్ సినిమాకు వచ్చి ‘పరదా’ ప్రమోషన్ చేయడం వల్ల బజ్ ఎక్కువ అవుతుందని కామెంట్లు చేస్తున్నారు. ‘పరదా’ సినిమా ఆగస్టు 22న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాపై కూడా మంచి హైప్ ఉంది. ఇక హరిహర వీరమల్లు చిత్ర విషయానికి వస్తే.. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రానికి క్రిష్ జాగర్లమూడి మరియు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది. విలన్ పాత్రలో బాబీ డియోల్ ఆకట్టుకున్నారు . ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చారు. సినిమా మిక్స్డ్ టాక్తో దూసుకుపోతుంది.
#Paradha ladies watch #HariHaraVeeraMallu at Prasad’s! #Paradha movie directed by Praveen Kandregula (Cinema Bandi & Subham fame) is releasing on 22 August! pic.twitter.com/sO7AgByzMt
— idlebrain jeevi (@idlebrainjeevi) July 24, 2025