తిరువీర్ హీరోగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పాపం ప్రతాప్’. ఎస్పీ దుర్గ నరేష్ దర్శకుడు. రాకేశ్రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరెడ్డి నిర్మాతలు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నుంచి ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానున్నది. ‘పిల్ల ఎక్కడుంది..’ అంటూ సాగే పాటను శనివారం మేకర్స్ విడుదల చేశారు. హీరో తిరువీర్ మాట్లాడుతూ ‘గత ఏడాది మా బుజ్జమ్మ నన్ను వదిలి వెళ్లిపోయింది. దీంతో ఊళ్లోవాళ్లంతా నా గురించే మాట్లాడుకున్నారు. అంతా ‘పాపం ప్రతాప్’ అని మాత్రమే అన్నారు కానీ.. నా సమస్యకు పరిష్కారం చెప్పినవాళ్లు మాత్రం లేరు. ఈ నెల 17న నా ‘బుజ్జమ్మ’తో మీ ముందుకు, మీ ఊర్లో థియేటర్లలో వస్తాను. అప్పటివరకూ ‘పాపం ప్రతాప్’ అన్నవాళ్లతోనే వీరప్రతాప్ అనిపించుకుంటా’ అన్నారు. సుద్దాల అశోక్తేజ సాహిత్యం, కేఎం రాధాకృష్ణ సంగీతం, రామ్ మిర్యాల గానంతో ఈ పాట పదికాలాల పాటు నిలిచేలా రూపొందిందని, సినిమా కూడా చాలా బాగా వచ్చిందని దర్శకుడు దుర్గా నరేష్ చెప్పారు.