వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘రంగ రంగ వైభవంగా’. కేతికా శర్మ నాయికగా నటిస్తున్నది. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ సంస్థ నిర్మిస్తోంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో దర్శకుడు గిరీశాయ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు.
సెప్టెంబర్ 2న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ…‘మా సినిమా విడుదల కోసం మెగాభిమానులు ఎదురుచూస్తున్నారు. మంచి ఫీల్ గుడ్ సినిమాగా మిమ్మల్ని మెప్పిస్తుంది. ఇటీవలే విడుదల చేసిన టీజర్కు మంచి స్పందన వచ్చింది. వైష్ణవ్ తేజ్ను కొత్తగా చూస్తారు. కేతికా నటన కూడా ఆకట్టుకుంటుంది’ అని చెప్పారు.