స్వాతి రెడ్డి అలియాస్ కలర్స్ స్వాతి .. ఈ అమ్మడు ఓ బుల్లితెర షోతో పాపులారిటీని అందిపుచ్చుకోగా ఆ తర్వాత మెల్లగా సినిమా ఆఫర్స్ అందుకుంది.తి. 2005లో దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కించిన డేంజర్ మూవీలో కీలక రోల్ చేశారు. ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించక పోయినప్పటికీ స్వాతి నటనకు మంచి మార్కులే పడ్డాయి. తమిళ్ మూవీ సుబ్రమణ్యపురంలో లీడ్ హీరోయిన్ అవకాశం దక్కించుకున్న స్వాతి, హీరోయిన్ గా హిట్ కొట్టింది.
తెలుగులో అష్టా చెమ్మా, స్వామి రారా, కార్తికేయ వంటి సూపర్ హిట్ చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. సౌత్ లో తెలుగు, తమిళ, మలయాళ బాషలలో 20కి పైగా చిత్రాలు చేశారు స్వాతి. 2018లో మలయాళ కుర్రాడు వికాస్ వసును పెళ్లి చేసుకున్న స్వాతి.. ఆ తర్వాత సినిమాలకు దూరం అయిపోయింది. ఇన్నాళ్లకు మళ్లీ పంచతంత్రం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
తాజాగా పంచతంత్రం నుండి టీజర్ విడుదల అయింది. అయితే ఈ టీజర్ ఎంతో ఆసక్తిగా ఉంది. కథల గురించి చెప్తూ ఉన్నటువంటి ఈ టీజర్ కి వాయిస్ ఓవర్ సత్యదేవ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బ్రహ్మానందం, స్వాతి రెడ్డి, సముద్ర ఖని, రాహుల్ విజయ్, శివాత్మీక రాజశేఖర్, నరేష్ అగస్త్య, దివ్య దృష్టి, వికాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మ్యాజికల్ డ్రామా ప్రేక్షకులకి మంచి వినోదం పంచేలా కనిపిస్తుంది. హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ప్రశాంత్ ఆర్. విహారి అందిస్తున్నారు. మీరు టీజర్పై ఓ లుక్కేయండి.