డా॥ బ్రహ్మానందం, స్వాతిరెడ్డి, సముద్రఖని, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం ‘పంచతంత్రం’. హర్ష పులిపాక దర్శకుడు. అఖిలేష్ వర్దన్, సృజన్ ఎరబోలు నిర్మాతలు. డిసెంబరు 9న చిత్రం విడుదల కానుంది. శనివారం ఈ చిత్రం ట్రైలర్ను కథానాయిక రష్మిక మందన్న సోషల్ మీడియా ద్వారా విడుదల చేసి చిత్ర యూనిట్కు అభినందనలు తెలిపింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ట్రైలర్కు మంచి స్పందన వస్తోంది.
ఇది ఐదు జంటలకు సంబంధించిన కథ. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, సంతోషాలు, బాధలు వుంటాయి. వాటిని మనం ఎలా స్వీకరించాం. మన పనులను ఎంత బాధ్యతగా పూర్తిచేస్తూ ముందుకుకెళ్లామనేది ఈ చిత్రం కథాంశం. ఈ కథాంశంలో ఒక్కో జంటది ఒక్కో రకమైన ప్రయాణం. వాటికి ఎలాంటి ముగింపు ఇచ్చామనేది ఆసక్తికరంగా వుంటుంది. ఫీల్గుడ్ ఎంటర్టైనర్గా హార్ట్టచింగ్ ఎమోషన్స్తో సినిమా ఉంటుంది’ అన్నారు. నరేష్ ఆగస్త్య, దివ్య ద్రిష్టి, వికాస్ ముప్పల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి, శ్రవణ్ భరద్వాజ్.