కోటి మొక్కల రామయ్యగా దేశవ్యాప్తంగా పేరుపొందిన ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి దరిపల్లి రామయ్య సేవలను స్మరిస్తూ రూపొందించిన లఘు చిత్రం ‘వనజీవి రామయ్య’. వేముగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిడిగొండ నరేశ్కుమార్ ప్రజాపతి నిర్మించారు.
గద్దర్ అవార్డ్స్లో ఈ సినిమా ఉత్తమ లఘుచిత్రంగా ఎంపికైన విషయం తెలిసిందే. బుధవారం వనజీవి రామయ్య జయంతిని పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద సేవకులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నిర్మాత.. తెలంగాణ రాష్ట్రంలోని పల్లెప్రకృతి వనాలకు వనజీవి రామయ్య పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్గా ఈ చిత్రాన్ని తీసుకురాబోతున్నామని దర్శకుడు పేర్కొన్నారు.