సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీతో షికార్లు కొట్టడం, వాణిజ్య ప్రకటనల్లో నటించడం చేస్తూ ఉంటాడు.మహేష్కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆయనతో యాడ్ చేయించేందుకు పలు కంపెనీలు పోటీ పడుతుంటాయి. ఇప్పటికే థమ్సప్ యాడ్ తో అలరించిన మహేష్ ఆ తర్వాత తమన్నాతో కలిసి ఓ యాడ్ చేశాడు.
ఇప్పుడు బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్తో కలిసి యాడ్ చేస్తున్నాడు. పాన్ బహార్ ఇలాచీ కోసం మహేష్ ఈ యాడ్ చేస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ కూడా కనిపించనున్నాడట. ప్రస్తుతం ఈ యాడ్కి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది.ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ సతీమణి నమ్రత ఈ షూట్కి సంబంధించిన ఫోటోలను, ఓ వీడియోను సామాజిక మాధ్యమాలలో షేర్ చేయడంతో వైరల్గా మారాయి.మహేష్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో మహేష్ సూపర్ స్టైలిష్గా కనిపించనున్నాడు. పరశు రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది.