టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ (Gopichand ), మారుతి (maruthi) కాంబినేషన్లో వస్తున్న చిత్రం పక్కా కమర్షియల్ (Pakka commercial). గోపిచంద్ 29వ ప్రాజెక్టుగా వస్తున్న ఈ మూవీలో రాశీఖన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటిస్తూ..గ్లింప్స్ వీడియోను లాంఛ్ చేశారు. ట్రైలర్ ఎలా ఉండబోతుందో క్యూరియాసిటీని కలిగించేలా ఈ వీడియోను కట్ చేశారు. జూన్ 12న రానుంది ట్రైలర్ .
‘మీరు కేసు ఒప్పుకునేముందు ఫీజు వద్దు రమ్మంటారు..పనయ్యాక వాడిని వంగోపెట్టి తరిమి అంటూ శ్రీనివాస్ రెడ్డి డైలాగ్స్ చెబుతుండగా..వీడియో బఫర్ అవుతుండటం చూడొచ్చు. ఏంటి అలా చూస్తున్నారు వీడియో బఫర్ అవ్వట్లేదు. మేమే ఆపాం..ఓ ముహూర్తం, టైం చూసి వదులుదామని. వచ్చినపుడు గట్టిగా చూసి ఎంకరేజ్ చేయండి..థ్యాంక్స్’ అంటూ మారుతి వాయిస్ ఓవర్తో ముగిసింది వీడియో. పక్కా కమర్షియల్ చిత్రం జులై 1 2022న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది.
ఈ మూవీకి జాక్స్ బీజోయ్ మ్యూజిక్ డైరెక్టర్..కాగా జీఏ2 పిక్చర్స్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా బన్నీవాసు (Bunny Vasu) నిర్మిస్తోండగా…SKN కో ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నాడు. కామెడీ ఎంటర్ టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీలో సత్యరాజ్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, సప్తగిరి కీ రోల్స్ లో నటిస్తున్నారు. సీటీమార్ సినిమా తర్వాత చేస్తున్న ప్రాజెక్టు కావడంతో..ఈ మూవీతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు గోపీచంద్.