లాస్ ఏంజిల్స్: అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో ఉన్న పికాక్ థియేటర్లో ఈ యేటి ఎమ్మీ టీవీ అవార్డులను ప్రకటించారు. ఆ వేడుకల్లో భాగంగా జరిగిన రెడ్ కార్పెట్పై భారత సంతతి అమెరికా మోడల్ పద్మా లక్ష్మీ మెరిశారు. లైమ్ గ్రీన్ గౌన్లో ఆమె స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. 53 ఏళ్ల పద్మా లక్ష్మీ తనతో పాటు తన కూతుర్ని కూడా రెడ్కార్పెట్పై పరిచయం చేశారు. 13 ఏళ్ల కృష్ణ ఆ ఈవెంట్లో హుషారుగా పాల్గొన్నది.
తల్లీకూతుళ్లు ఇద్దరూ ఓ జంటలా రెడ్కార్పెట్పై షో చేశారు. లక్ష్మీ కూతురు మాత్రం బ్లాక్ కలర్ గౌన్ వేసుకున్నది. పద్మా లక్ష్మీ వేసుకున్న మార్చెసా గౌన్ రెడ్కార్పెట్లో ప్రత్యేకంగా నిలిచింది. గతంలో ఎక్కువ శాతం ఫ్లోరల్, మ్యాక్సీ డ్రెస్సులు వేసినట్లు ఆమె చెప్పింది. 70వ దశకంలో పెరగడం వల్ల అప్పట్లో వేసుకున్న దుస్తుల ప్రభావం తనపై ఉంటుందన్నారు.