Paarijatha Parvam | టాలీవుడ్ యువ నటుడు చైతన్య రావు, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రల్లో వస్తున్న తాజా చిత్రం ‘పారిజాత పర్వం’. ఈ సినిమాకు సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహిస్తుండగా.. సునీల్, శ్రద్ధా దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. క్రైమ్ కామెడీ రానున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్తో పాటు కాన్సప్ట్ వీడియో విడుదల చేయగా.. ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాని ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మూవీ నుంచి టీజర్ విడుదల చేసింది.
టీజర్ గమనిస్తే.. ‘కిడ్నాప్ అనేది ఒక ఆర్ట్’ అనే లైన్తో టీజర్ స్టార్ట్ అవుతుంది. ఇక ప్రధాన పాత్రలను పరిచయం చేయటంతో ప్రారంభమైన ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తకరంగా సాగింది. కథంతా కిడ్నాపుల చుట్టూనే తిరుగుతుందని అర్థమవుతోంది. యాక్షన్, డ్రామా, ఫన్.. ఇలా అన్నీ ఎలిమెంట్స్ కలబోసిన ఈ టీజర్ ప్రస్తుతం ప్రేక్షకులని అలరిస్తోంది.
వనమాలి క్రియేషన్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ సినిమాను మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తుండగా.. వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖవాణి, సమీర్, గుండు సుదర్శన్, జబర్దస్త్ అప్పారావు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.