సామాజికాంశాలను తెరపై ఆవిష్కరించడంతో సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్నారు తమిళ దర్శకుడు పా.రంజిత్. ఆయన తాజా చిత్రం ‘వెట్టువమ్’లో ఓ సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. బుధవారం ఈ పాన్ ఇండియా సినిమా తాలూకు ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు. శతాబ్దాల నాటి భారతీయ సంప్రదాయ క్రీడ మల్లఖంబం నేపథ్యంలో ఈ పోస్టర్ను తీర్చిదిద్దారు.
నిలువుగా ఏర్పాటు చేసిన కర్రపై జిమ్నాస్టిక్స్ తరహాలో విన్యాసాలను ప్రదర్శించడం ఈ క్రీడ ప్రత్యేకత. ఇప్పటివరకు ఏ కమర్షియల్ సినిమాలో కనిపించని సంప్రదాయ మల్లఖంబం క్రీడను కథలో భాగంగా చూపించడం ఆసక్తినిరేకెత్తిస్తున్నది. ఈ క్రీడను కేవలం యాక్షన్ ఘట్టాల కోసమే ఉపయోగించారా? లేక సినిమా కథతో ఏమైనా సంబంధం ఉందా అనే విషయం తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఈ చిత్రంలో కలై అరసన్, మైమ్ గోపి, శోభితా ధూళిపాళ తదితరులు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు.