Ambati Rayudu | ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) ఇటీవలే అధికార వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీలోకి చేరిన ఎనిమిది రోజులకే వైసీపీ నుంచి బయటకు వచ్చి.. కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు. తాజాగా జనసేన చీఫ్, సినీ నటుడు పవన్ కల్యాణ్తో సమావేశమవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అంబటి రాయుడు జనసేన పార్టీలోకి చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది.
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్తో భేటీపై అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ ఆలోచనలు, నా ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. ప్రజలకు సేవ చేయాలన్న నా కల వైసీపీతో నెరవేరేలా లేదు. నేను క్రికెట్ ఆడేందుకు దుబాయ్ వెళ్తున్నానని చెప్పుకొచ్చారు. తాజా వ్యాఖ్యలతో తాను రానున్న రోజుల్లో జనసేనతో కలిసి పనిచేయబోతున్నట్టు చెప్పకనే చెప్పినట్టు అర్థమవుతుండగా.. దీనిపై క్లారిటీ రావాలంటే కొంతకాలం ఆగాల్సిందే.